ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. చంపేసి.. శవాలను రెండు రాష్ట్రాల్లో పడేసి..

By telugu news teamFirst Published Sep 18, 2021, 10:25 AM IST
Highlights

దీంతో ప్రేమికులిద్దరూ జులై 31 ఢిల్లీకి ారాిపోయారు. వారు ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో బాలిక బంధువులు అక్కడకు చేరుకున్నారు.

తమ ఇంటి అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని వారు కక్ష పెంచుకున్నారు. అతి దారుణంగా వారిని వెంటాడి మరీ చంపేశారు. ఆ తర్వాత శవాలను రెండు రాష్ట్రాల్లో పడేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ ప్రాంతంలోని జహంగీర్ పుర్ లో ఓ యువకుడు నివసించేవాడు. అతడి ఇంటి సమీపంలో ఉండే మైనర్  బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్డంతో పెళ్లికి వారు ససేమిరా అన్నారు. దీంతో ప్రేమికులిద్దరూ జులై 31 ఢిల్లీకి ారాిపోయారు. వారు ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో బాలిక బంధువులు అక్కడకు చేరుకున్నారు.

వారిని జీపులో ఎక్కించుకొని మధ్యప్రదేశ్ లోని భిండ్ కు , అక్కడి నుంచి గ్వాలియర్ కు వెళ్లారు. ఈ దారిలోని యువకుడికి అత్యంత దారుణంగా హతమార్చారు. అతడి మర్మాంగాలకు కత్తితో కోసేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆగస్టు 5వ తేదీన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా రాజస్థాన్ లోని ధోల్ పురా ప్రాంతంలో ఓ బాలిక శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఓ తాడుతో ఆమెకు ఉరి బిగించి హత్య  చేశారు. అనుమానంతో బాలిక కుటుంబీకుల ఫోన్ లోకేషన్లను పరిశీలించిన పోలీసులు వారు ఢిల్లీ, గ్వాలియర్, ధోల్ పుర్ ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలుసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. ఈ జంట హత్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

click me!