భారత్ లో చైనా దేశీయుడి పర్యటన.. ఎక్కడెక్కడ తిరిగాడో...

Published : Mar 24, 2020, 10:38 AM IST
భారత్ లో చైనా దేశీయుడి పర్యటన.. ఎక్కడెక్కడ తిరిగాడో...

సారాంశం

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. 

చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా కారవ్యాన్‌లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాడన్న ఓ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ భయంతో వణికిపోతున్న ప్రజలు.. ఈ వార్త విని ప్రజలు మరింత భయపడిపోతున్నారు. ఎక్కడెక్కడ తిరిగాడో.. అతనికి కూడా వైరస్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read కరోనా వైరస్: అపశకునం ద్వారా ముందే హెచ్చరించిన పూరి జగన్నాథ

పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్యాట్రిక్‌ అనే వ్యక్తి సొంత కారవ్యాన్‌లో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. 

దీంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్రిక్‌ కరోనా ప్రబలక ముందే తాను భారత్‌కు వచ్చానని అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరంలోకి ప్రవేశించకుండా కారవ్యాన్‌లో ఉంటున్నానని తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో