విపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర.. బీజేపీతో రహస్య ఒప్పందం : కేజ్రీపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శలు

Siva Kodati |  
Published : Jun 25, 2023, 05:12 PM IST
విపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర.. బీజేపీతో రహస్య ఒప్పందం : కేజ్రీపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శలు

సారాంశం

ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. విపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీతో కలిసి కేజ్రీవాల్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 

ఢిల్లీ రాష్ట్రంలో బ్యూరోక్రసీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగడుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే అతను కాంగ్రెస్‌‌ను విభేదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా నిరంతరాయంగా కౌంటర్ ఇస్తూనే వుంది. దీని కారణంగా దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతు కోరిన తీరును ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం కాంగ్రెస్‌పై కక్ష సాధిస్తోందని, ఆపై మద్దతు కోరుతోందని ఆయన అన్నారు. తమ పార్టీని, నేతలను దూషిస్తూ మీరు మద్దతు ఎలా కోరుకుంటారంటూ అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని బహిరంగంగా విమర్శించి మద్దతు కోరడం సరైన మార్గమా అని ఆయన ప్రశ్నించారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడడం లేదని ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఇది ఆయన బాగా ఆలోచించి తీసుకున్న చర్య అంటూ మాకెన్ చురకలంటించారు. పార్లమెంటు, ఢిల్లీ అసెంబ్లీ లేదా మరెక్కడైనా ఆప్ గత చర్యలు బిజెపితో వారి రహస్య పొత్తును బలోపేతం చేస్తాయని ఆయన విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ పనులను అపఖ్యాతి పాలైనవని అజయ్ మాకెన్ దుయ్యబట్టారు. ఆయన విశ్వసనీయతపై ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అన్నా ఉద్యమ స్థాపకులను అడిగితే తెలుస్తుందన్నారు. 

అరవింద్ కేజ్రీవాల్ పనులను ఎవరూ పట్టించుకోలేదని.. వారి విస్తృత అవినీతి వల్ల బీజేపీకి మాత్రమే లాభమని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. గోవా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాంలలో ఆమ్ ఆద్మీ పార్టీ .. కాంగ్రెస్ ఖర్చుతో బిజెపికి సహాయం చేసిందని ఆయన ఆరోపించారు. బిజెపికి సహాయం చేయడానికి, కాంగ్రెస్‌పై పోటీ చేయడానికి అక్రమంగా సంపాదించిన డబ్బును ఉపయోగిస్తారని మాకెన్ వ్యాఖ్యానించారు. 'ఆమ్ ఆద్మీ' లేదా 'సామాన్యుడు' ముసుగులో, మీరు మీ కోసం ఒక రాజభవనం నిర్మించడానికి రూ.171 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి ఢిల్లీ పౌరులను మోసగించారంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధుడు కాదని.. అవినీతిలో మోకరిల్లుతున్నారని మాకెన్ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్