మణిపూర్ హింసాకాండపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్.. రాష్ట్రప‌తికి విన‌తిప‌త్రం అంద‌జేత

Published : May 30, 2023, 05:20 PM IST
మణిపూర్ హింసాకాండపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్.. రాష్ట్రప‌తికి విన‌తిప‌త్రం అంద‌జేత

సారాంశం

Manipur violence: ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ లో అశాంతిని నియంత్రించడానికి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జాతి హింసను నియంత్రించే ప్రయత్నాలలో నిర్ల‌క్ష్యం చూపింద‌నీ, దీని కార‌ణంగా ప‌రిస్థితులు దారుణంగా మారాయ‌ని ఆరోపించింది.  

Congress demands judicial probe into Manipur violence: మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా జోక్యం చేసుకోవాలనీ, హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతల బృందం మంగళవారం అధ్యక్షుడు ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేసింది. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ప్రతినిధి బృందం 12 సూత్రాల డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. హింస ప్రారంభమైన తొలినాళ్లలో పరిస్థితి నిర్వహణలో అనేక లోపాలున్నప్పటికీ ప్రస్తుత దుస్థితికి దారితీసింది. ఇప్పుడు వేలెత్తి చూపే సమయం కాదు, చర్యలు తీసుకోవాల్సిన సమయమ‌ని కాంగ్రెస్ వినతిపత్రంలో పేర్కొంది.

మణిపూర్ లో 80 మందిని పొట్టనబెట్టుకున్న జాతి ఉద్రిక్తతలను చల్లార్చడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాత్రి మణిపూర్ చేరుకున్నారు. మరో మూడు రోజుల్లో అమిత్ షా అన్ని వర్గాలతో చర్చలు జరపనున్నారు. మణిపూర్ లో మే 3వ తేదీ నుంచి జాతి హింస చెలరేగడంతో రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న మైతీ కమ్యూనిటీకి, కొండ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్న కుకీలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  ఈ ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ గత వారం రోజులుగా వరుస ఘర్షణలు, కాల్పులతో హింస చెలరేగి ఆదివారం నాటి మరణాలకు దారితీసింది. త్రిపుర కేడర్ కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రాజీవ్ సింగ్ ను కూడా హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర పోలీసు శాఖలో చేర్చుకుంది. అరుదైన చర్యగా హోం మంత్రిత్వ శాఖ రాజీవ్ సింగ్ క్యాడర్ ను త్రిపుర నుంచి మణిపూర్ కు మార్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సింగ్ కు స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నారు.

శాంతి, సామరస్యం-సాధారణ స్థితిని తక్షణమే పునరుద్ధరించడానికి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో హింసను నియంత్రించడానికి దృఢమైన-నిరంతర ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ తమ వినతిపత్రంలో పిలుపునిచ్చింది. అన్ని మిలిటెంట్ గ్రూపులను నియంత్రించడానికి, పరిమితం చేయడానికి కేంద్రాన్ని వెంటనే అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రప‌తి ముర్మును కోరింది. తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అన్ని సాయుధ పౌర సమూహాలను తక్షణమే నిలిపివేసేలా చూడాలని కోరారు. సహాయక శిబిరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని, అందరికీ సరైన ఆరోగ్య, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్ తన వినతిపత్రంలో పేర్కొంది. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితికి బీజేపీ విభజన రాజకీయాలే కారణమన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం, పరిపాలనా వైఫల్యం, మణిపూర్ లో రాజకీయ వైఫల్యమే ఇందుకు కారణమని కూడా ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu