మోదీ పాలనలో దారుణాలు.. భయం నీడలో  మైనార్టీలు.. : చిదంబరం సంచలన ఆరోపణలు  

Published : Oct 08, 2023, 03:39 AM IST
మోదీ పాలనలో దారుణాలు.. భయం నీడలో  మైనార్టీలు.. : చిదంబరం సంచలన ఆరోపణలు  

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతుందనీ, వారి పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. ఈ దేశంలో మైనార్టీలు భయం నీడలో బతుకుతున్నారని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలోని మైనారిటీలు భయంతో జీవిస్తున్నారని, వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో శనివారం నిర్వహించిన క్రైస్తవ హక్కుల సభలో ఆయన ప్రధానిని టార్గెట్ చేశారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పొదుపు తగ్గుదల, గృహ రుణాల పెరుగుదల కారణంగా దేశంలోని అన్ని వర్గాలకు న్యాయమైన వాటా దక్కడం లేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గానీ, తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గానీ లేదని పి.చిదంబరం పేర్కొన్నారు.


మైనారిటీల విషయంలో వారికి న్యాయమైన వాటా రాకపోవడానికి ఇదే కారణమని, అది వారి పట్ల వివక్ష అని చిదంబరం ఆరోపించారు. ఈ దేశంలో మైనార్టీలు భయం నీడలో బతుకుతున్నారని అన్నారు.  దేశంలో క్రైస్తవుల జనాభా 3.30 కోట్లు అని, మోదీ ప్రభుత్వంలోని 79 మంది మంత్రుల్లో ఒక్కరు మాత్రమే క్రైస్తవుడని తెలిపారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు. ఎవరూ క్రైస్తవులు కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2017-21 మధ్య 2,900 మత ఘర్షణలు జరిగాయని, ఈ సంఘటనల భారాన్ని మైనారిటీలు భరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

భారతదేశంలో మత స్వేచ్ఛ క్షీణించిందనీ, చర్చిలపై ఆరోపించిన దాడుల గురించి మీడియా నివేదికలు, అంతర్జాతీయ మత స్వేచ్ఛపై US ప్రభుత్వ నివేదికను ప్రస్తావిస్తూ.. అతని ప్రకారం, భారతదేశంలో మత స్వేచ్ఛ మరింత దిగజారిపోయిందని పేర్కొంది.

భారతదేశంలో వేలాది సంస్థలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని, వాటికి ఇతర దేశాల నుంచి నిధులు అందుతున్నాయన్నారు. క్రైస్తవ సంస్థలు ఇతర క్రైస్తవ దేశాలు, క్రైస్తవ సమూహాల నుండి నిధులు పొందుతాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంత కాలం దాన్ని ఆపలేదని అన్నారు. 

2017-22 మధ్యకాలంలో 6,622 సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రిజిస్ట్రేషన్‌ను కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రద్దు చేసిందని చిదంబరం తెలిపారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దేశంలో ప్రజాస్వామ్యం తగ్గిపోతే మైనార్టీలు ఎక్కువగా నష్టపోతారని ఆరోపించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu