క్రాకర్స్ కాల్చడం నుంచి వాహనాలకు నిప్పు పెట్టే వరకు.. గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. 19 మంది అరెస్టు

Published : Oct 25, 2022, 12:59 PM IST
క్రాకర్స్ కాల్చడం నుంచి వాహనాలకు నిప్పు పెట్టే వరకు.. గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. 19 మంది అరెస్టు

సారాంశం

గుజరాత్‌లో దీపావళి నాడే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి 12.45 గంటల ప్రాంతంలో క్రాకర్స్ కాలుస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఆ తర్వాత స్థానిక వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపైకీ పెట్రోల్ బాంబ్ విసిరేశారు.  

వడోదర: గుజరాత్‌లో దీపావళి రోజున రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వడోదర నగరంలో క్రాకర్స్ కాల్చడంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. తొలుత వాగ్వాదం జరిగినా ఆ తర్వాత ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లింది. అనంతరం, అక్కడే ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు స్పాట్‌కు రాగానే వారిపైనా పెట్రోల్ బాంబు విసిరేశారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 19 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులపై పెట్రోల్ బాంబ్ విసిరిన నిందితుడినీ అదుపులోకి తీసుకున్నారు.

వడోదరలో రాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైర్ క్రాకర్స్ కాలుస్తుండగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రాకెట్ బాంబులను ఒకరి పై మరొకరు విసిరారు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు రాళ్లు విసిరారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వాహనాలు, ఇతరుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో ఉన్న మూకలో ఒకరు అక్కడి వీధి దీపాలకు కరెంట్ సరఫరాను నిలిపేసినట్టు స్థానికులు తెలిపారు. తద్వారా వారిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటుందని వారు భావించినట్టు తెలుస్తున్నది.

Also Read: దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్న బాధితులు..

ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్టు పోలీసులు వివరించారు. ఘటన గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టినట్టు వివరించారు. దోషులను పట్టుకునే పనుల్లో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాట ఎన్నికలు కమలహాసన్ కీలక సందేశం in Tamil Nadu Elections | Asianet News Telugu
కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu