gang-rape: గుడికి వెళ్లివ‌స్తున్న బాలిక‌పై సామూహిక లైంగిక‌దాడి

By Mahesh RajamoniFirst Published Jan 23, 2022, 10:53 PM IST
Highlights

gang-rape: ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన దేశంలో నిత్యం ఏదో ఒక చోటు మ‌హిళ‌లపై లైంగిక‌దాడులు, అఘాయిత్యాలు, దాడులు, వేధింపులు, హింస చోటుచేసుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలో ఒంట‌రిగా స‌మీపంలోని దేవాల‌యానికి వెళ్లి వ‌స్తున్న బాలిక‌ను కిడ్నాప్ చేసిన దుండ‌గులు.. సామూహిక లైంగికదాడి (gang-rape)కి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో చోటుచేసుకుంది. 

gang-rape: ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన దేశంలో నిత్యం ఏదో ఒక చోటు మ‌హిళ‌పై లైంగిక‌దాడులు, అఘాయిత్యాలు, దాడులు, వేధింపులు, హింస చోటుచేసుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలో ఒంట‌రిగా స‌మీపంలోని దేవాల‌యానికి వెళ్లి వ‌స్తున్న బాలిక‌ను కిడ్నాప్ చేసిన దుండ‌గులు.. సామూహిక లైంగికదాడి (gang-rape) కి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) లో చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి త‌ల్లిదంద్రులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) లో చోటుచేసుకున్న ఈ లైంగిక‌దాడ‌ది ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బిలాస్‌పూర్ (Bilaspur) లో నివాస‌ముంటున్న 13 సంవ‌త్స‌రాల బాలిక ప్ర‌తిరోజు గుడికి వెళ్లి వ‌స్తుండేది. మ‌ద్యం సేవించి జులాయిగా తిరిగే న‌లుగురు వ్య‌క్తులు ఆమెను గ‌మ‌నించ‌సాగారు. ఈ క్ర‌మంలోనే  గురువారం  నాడు గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తున్న బాధిత బాలిక‌ను  వెంబ‌డించి.. ఆ న‌లుగురు నిందితులు కిడ్నాప్ చేశారు. అర‌వ‌కుండ నోరు మూసి.. సమీపంలోని పొలానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ త‌ర్వాత ఆ మైన‌ర్ బాలిక‌పై సామూహిక లైంగిక దాడి (gang-rape) కి పాల్ప‌డ్డారు. అనంత‌రం అక్క‌డి నుంచి నిందితులు పారిపోయారు.

చాలా స‌మయం వ‌ర‌కు బాదితురాలు అప‌స్మార‌క స్థితిలోనే ఉండిపోయింది. అతిక‌ష్టం మీద లేచి ఇంటికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే కొద్ది దూరం న‌డిచి కింద‌ప‌డిపోయింది. బాలిక ఇంటికి రాక‌పోవ‌డంతో అప్ప‌టికే ఆమె త‌ల్లిదండ్రులు వెత‌క‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే బాలిక‌ప‌డివున్న ప్రాంతానికి చేరుకున్నారు. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న బాలిక ఒంటిపై తీవ్ర‌మైన గాయాలు ఉన్నాయి. జ‌రిగిన విష‌యాన్ని (gang-rape) త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారు పోలీసుల (police)ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదుచేసుక‌న్న పోలీసులు.. నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. బాలిక‌పై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన న‌లుగురు నిందితులు దీపక్ నిషాద్ (27), సూరజ్ సూర్యవంశీ (21), సూరజ్ యాదవ్ (20), మహేష్ పాసి (19)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ క‌ల్పించే POCSO చట్టంలోని ప‌లు సెక్ష‌న్ల కింది నిందితుల‌పై కేసులు న‌మోదుచేశారు. 

మ‌హారాష్ట్ర (maharashtra) లోనూ ఓ బాలిక‌పై లైంగిక‌దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పింప్రి-చించ్వాడ్ (Pimpri-Chinchwad) ప్రాంతంలో 13  ఏండ్ల ఓ బాలిక‌పై 21 సంవ‌త్స‌రాల యువ‌కుడు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. శ‌నివారం నాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు న‌మోదుచేశారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. పింప్రి-చించ్వాడ్  ప్రాంతంలో నివాస‌ముంటున్న బాధితురాలి త‌ల్లిదండ్రులు కూలీకి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇంట్లోకి చొర‌బ‌డి బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు ఓ యువ‌కుడు. బాలిక తల్లిదండ్రులకు జరిగిన ఘ‌ట‌న గురించి చెప్ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు (police) POCSO చ‌ట్టం కింద కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

click me!