
Char Dhamchar dham yatra: చార్ధామ్ యాత్ర నేపథ్యంలో భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. బుధవారం అర్థరాత్రి రాణా చట్టి మరియు సయన చట్టి మధ్య యమునోత్రి హైవే 15 మీటర్ల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడటంతో బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి.దీని కారణంగా యమునోత్రి ధామ్ వైపు యాత్రకు అంతరాయం ఏర్పడిందని.. 3000 మంది యాత్రికులు ఆయా పరిస్థితుల్లో చిక్కుకుపోయారని అక్కడి భద్రతా అధికారులు తెలిపారు.
చిన్న వాహనాలు మాత్రమే బార్కోట్ నుండి జన్ కి చట్టి వరకు వెళ్లగలిగాయి. బస్సులు మరియు ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారని ఉత్తరకాశీలోని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. "యమునోత్రి జాతీయ రహదారిపై రాణా చట్టి మరియు సయానా చట్టి మధ్య 15 మీటర్ల రహదారి విస్తరణ కారణంగా బస్సులు మరియు యాత్రికులను తీసుకువెళ్ళే ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి, అయితే చిన్న వాహనాలు రహదారి గుండా వెళ్ళగలిగాయి.. ఒక ట్రాక్టర్ ట్రాలీ, రెండు జేసీబీ యంత్రాలు, ఒక టిప్పర్, ఒక పోక్ల్యాండ్ మరియు 15 మంది కూలీలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. త్వరలోనే విరిగిపడిన కొండచరియలను తొలగించి.. దారిని అందుబాటులోకి తీసుకువస్తాం" అని అధికారులు తెలిపారు.
ఈ ఘటన కారణంగా దాదాపు 24 బస్సులు, 15కు పైగా యాత్రికుల మినీ బస్సులు నిలిచిపోయాయని, చిక్కుకుపోయిన యాత్రికులను సయన చట్టి చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, అతిథి గృహాల్లోని సురక్షిత ఆశ్రయాలకు తరలించామని డీడీఎంఏ అధికారులు తెలిపారు. అయితే, హృషికేశ్-గంగోత్రి రహదారి, వికాస్ నగర్-బర్కోట్ జాతీయ రహదారి, చినాలై సౌద్-సువాఖోలి, ఉత్తరకాశీ-లామ్గావ్-శ్రీనగర్ మరియు ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారి తెరిచి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు చార్ ధామ్ యాత్రలో 48 మంది యాత్రికులు (చార్ ధామ్) మరణించారు. వారు గుండె జబ్బులు మరియు ఇతర వ్యాధులు, అనారోగ్యం కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. యమునోత్రిలో 15 మంది చనిపోయారు. గంగోత్రిలో నలుగురు మృతి చెందారు. బద్రీనాథ్లో ఎనిమిది మంది చనిపోయారు. కేదార్నాథ్లో 21 మంది చనిపోయారు. వీరిలో ఒకరు గురువారం ఉదయం మృతి చెందారని అధికార యాంత్రాంగం వెల్లడించింది.
ఇప్పటి వరకు 6.5 లక్షల మంది చార్ధామ్ యాత్రను పూర్తి చేశారు. బుధవారం నాటికి 16,788 మంది కేదార్నాథ్ చేరుకున్నారు. దీంతో 2 లక్షల 33 వేల 711 మంది కేదార్నాథ్ను సందర్శించారు. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 1 లక్షా 88 వేల 346 మంది బద్రీనాథ్ను సందర్శించారు. యమునోత్రిని 1,06,352 మంది సందర్శించారు. గంగోత్రిని 1,30,855 మంది సందర్శించారు. ఇదిలావుండగా, చార్ ధామ్ యాత్ర పరిస్థితుల నేపత్యంలో ఈ మార్గంలో భక్తుల కోసం ప్రయివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను తీసుకువచ్చారు. భక్తులకు ఉచిత ఆరోగ్య సేవలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. "చార్ ధామ్ యాత్ర ప్రజలకు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుందని మరియు యాత్ర అంతటా వారు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరకుకుంటున్నాము. సామాజిక సంస్థకు చెందిన వైద్యులు మరియు నర్సుల బృందాలు ఈ సమయంలో భక్తులకు ఆరోగ్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా యాత్ర అందిస్తాయి" అని తెలిపారు. అయినప్పటికీ.. ఇప్పటికే 40 మందికి పైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.