
చెన్నై : ఫొటోషూట్ పేరుతో సహాయనటిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కెమెరామెన్ కాశీనాథన్ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కొడుంగయూరు ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల యువతి టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. ఇటీవల వలసరవాక్కం ఓం శక్తినగర్ కు చెందిన కెమెరామెన్ కాశీనాథన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంగా తనకు పలువురు డైరెక్టర్లతో పరిచయం ఉందని, హీరోయిన్ గా చేస్తానని ఆమెకు తెలిపారు. ఆ మేరకు ఆదివారం రాత్రి తన ఇంటికి వస్తే ఫోటోషూట్ జరుపుతానని చెప్పాడు. కాశీనాథన్ మాటలు నమ్మి ఆ యువతి అతని ఇంటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీనాథన్ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆమె వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాశీనాథన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా ఏప్రిల్ 1న జూబ్లీహిల్స్ లోబంధువు చేతిలో మోసపోయిన ఓ బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి హై కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. బాలిక (15)ను ఆమె బంధువు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకు వెళ్లి... బలవంతంగా తన లైంగిక వాంఛ తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కుటుంబసభ్యులు నీలోఫర్ ఆశ్రయించారు. అందుకు వారు నిరాకరించారు. అబార్షన్ చేయాలంటే చట్టప్రకారం అనుమతులు అవసరం.. అని చెప్పడంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది.
15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆమె ఇష్టపూర్వకంగానే బంధువులో వెళ్ళినా, లైంగికంగా కలిసినా.. అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని… శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉందని పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంచిత గర్భాన్ని తొలగించుకోవచ్చు అని తెలిపింది. అయితే దీనికి ముందు బాలికతో మాట్లాడాల్సి ఉందని చెప్పింది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమని తెలపడంతో.. నిలోఫర్ ఆసుపత్రి సూపర్డెంట్ కు తమ అభిప్రాయం చెప్పాలని కోరింది. బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాడాలని ఆదేశించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వారిద్దరికీ వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులకు హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) 8వ తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన, అప్పటికే పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్న బంధువు (26) వ్యక్తిగత పనుల నిమిత్తం నవంబర్ నెలలో వీరి ఇంటికి వచ్చాడు. బాలిక తల్లిని అక్క అని పిలిచేవాడు. పనినిమిత్తం వచ్చిన అతను కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బాలిక మీద కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనికి బయటకు వెళ్లగా.. బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు.
కొద్దిరోజుల తర్వాత అతడి పనులు అయిపోవడంతో ఖమ్మం తిరిగి వెళ్ళిపోయాడు ఈ క్రమంలోనే బాలిక తరచుగా అనారోగ్యానికి గురవుతూ వస్తుంది. ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతుండడంతో తల్లిదండ్రులకు బంధువు చేసిన విషయం చెప్పింది. వెంటనే వారు బంజారాహిల్స్ పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తరువాత వైద్యపరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో ఆమె తల్లి ముందు నిలోఫర్ వైద్యులను.. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించింది.