CAG Report : దేశంలోనే మిగులు బడ్జెట్ రాష్ట్రాలో యూపీ టాప్.. మరి ఏపీ పరిస్థితి?

Published : Sep 23, 2025, 09:16 PM IST
CAG Report

సారాంశం

CAG Report : కాగ్ నివేదికలో యూపీ ₹37,000 కోట్ల రెవెన్యూ మిగులుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. యోగి ప్రభుత్వ విధానాలతో ఆర్థిక మార్పు వచ్చిందని అంటున్నారు. 

CAG Report : ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ఆర్థిక రంగంలో దేశం దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదికలో రెవెన్యూ మిగులు ఉన్న 16 రాష్ట్రాల జాబితాలో యూపీ అగ్రస్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ₹37,000 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేసింది. ఈ విజయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విధానాల వల్లే సాధ్యమయ్యింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పథకాలు యూపీ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా దేశానికే రొల్ మోడల్ గా నిలబెట్టాయి. 

బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉంది

యూపీ తర్వాత గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా మిగులులో ఉన్నాయని కాగ్ నివేదిక చెబుతోంది. వీటిలో చాలా వరకు బీజేపీ పాలనలోనే ఉన్నాయి. అరుణాచల్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్యంలోని అనేక చిన్న రాష్ట్రాలు కూడా మిగులులో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.

12 రాష్ట్రాలు ఇప్పటికీ రెవెన్యూ లోటుతో సతమతం

యూపీ వంటి రాష్ట్రాలు మిగులులో ఉండగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి 12 రాష్ట్రాలు ఇప్పటికీ లోటుతో ఇబ్బంది పడుతున్నాయి. నివేదిక ప్రకారం, ఈ రాష్ట్రాల ఆదాయం వారి అవసరాలను తీర్చలేకపోతోంది, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై ఆధారపడాల్సి వస్తోంది.

పన్నుల వసూళ్లు, బడ్జెట్‌లో రెట్టింపు వేగం

కాగ్ నివేదిక యూపీ ఆర్థిక విజయాలను ప్రత్యేకంగా హైలైట్ చేసింది.

  • పన్నుల వసూళ్లు: 2012-13లో ₹54,000 కోట్లుగా ఉండగా, 2024-25 నాటికి ఇది ₹2,25,000 కోట్లకు చేరుకుంది.
  • బడ్జెట్ పరిమాణం: 2012-13లో ₹2 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి ఇది ₹8 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
  • స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP): 2012-13లో ₹8 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి ₹30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఈ నివేదిక కేవలం అంకెల కథ కాదు, ఒకప్పుడు వెనుకబాటుతనం, ఆర్థిక సంక్షోభానికి ప్రతీకగా నిలిచిన యూపీ ఇప్పుడు పెట్టుబడులకు, అభివృద్ధికి కేంద్రంగా మారుతోందని చెబుతోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెవెన్యూ సేకరణ, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక సంస్కరణల ద్వారా సాధించిన ఫలితాలు యూపీ ప్రతిష్టను మార్చాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !