యూపీలో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి, 30 మందికి గాయాలు..

Published : Dec 17, 2022, 05:15 PM IST
యూపీలో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి, 30 మందికి గాయాలు..

సారాంశం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 75 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. 30 మందికి గాయాలయ్యాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా టౌన్‌షిప్‌లోని సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం 75 మంది పిల్లలతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. 30 మంది గాయపడ్డారు. జౌన్‌పూర్‌లోని కాంతి దేవి జనతా విద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం ఓ బస్సులో ప్రతాప్‌గఢ్‌లోని మాన్‌గర్ ధామ్‌, అలాగే ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్‌కు పర్యటన కోసం బయలుదేరింది.

భార్యతో గొడవపడి.. రెండేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసి.. ఆపై అతడు కూడా ..

అయితే బస్సు 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్-వారణాసి హైవేపై హాండియాలో ప్రాంతానికి చేరుకుంది. భేస్కీ గ్రామానికి వచ్చే సరికి ఒక్క సారిగా ఎదురుగా ఓ బైక్ వచ్చింది. దీంతో వారిని తప్పించే ప్రయత్నంలో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఉలిక్కిపడ్డ విద్యార్థులు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో స్థానికులు, భేస్కీ గ్రామస్తులు అక్కడికి చేరుకొని బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయపడిన 27 మంది విద్యార్థులను సమీపంలోని హండియా టౌన్‌షిప్‌లోని దేవరాజ్ ఆసుపత్రికి తరలించారు.

"టాప్ సీక్రెట్": గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అరెస్టుపై సీఎం భగవంత్ మాన్

అయితే ఘోరహన్‌ కు చెందిన 9వ తరగతి విద్యార్థి అంకిత్‌ కుమార్‌, భారతీపూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి అనురాగ్‌లు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గంగా నగర్ డీసీపీ అభిషేక్ అగర్వాల్‌తో పాటు సీనియర్ పోలీసు అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్ సీ)లో చేర్పించారు ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వారిని కూడా హాస్పిటల్ కు తరలించారు.

ముంబైలోని ఘట్కోపర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 22 మందికి గాయలు.. ఘటనా స్థలానికి చేరుకున్న 8 ఫైర్ ఇంజన్లు..

 ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. “ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలోని సీహెచ్ సీలో చేర్పించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కచ్చితమైన మరణాల సంఖ్య కొంత సమయం తరువాత తెలుస్తుంది ’’ అని డీసీపీ అగర్వాల్ అన్నారు.

జగన్నాథ ఆలయానికి రూ. లక్ష విరాళమిచ్చిన 70 ఏళ్ల యాచకురాలు.. ఎక్కడంటే ?

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సులో 40 మంది బాలురు, 35 మంది బాలికలు ఉన్నారు. ఏడుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అయితే బస్సులో 41 మందికి మాత్రమే ప్రయాణ సామర్థ్యం ఉంది. ప్రమాద సమయంలో బస్సు అధికవేగంలో ఉందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial