
మధ్యప్రదేశ్లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో శివరాజ్సింగ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవేశ్ శుక్లాను వెంటనే అరెస్టు జైలుకు తరలించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత, ప్రవేశ్ శుక్లా గ్రామానికి పెద్ద సంఖ్యలో అధికారులు చేరుకున్నారు. నిందితుడు అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు. దీంతో పాటు అతడిపై ఎన్ఎస్ఏ విధించారు. ప్రవేశ్ శుక్లా అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్లో అధికారులు అతన్ని విచారించారు. అయితే.. ఈ వీడియో ఒకటిన్నర నుంచి రెండేళ్ల కిందటిదని చెబుతున్నారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రవేశ్ శుక్లాపై బుల్డోజర్ చర్యకు డిమాండ్ వచ్చింది. నిందితుడి ఇంటిని బుల్డోజర్ కూల్చి వేయాలని ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఆక్రమిత భాగాన్ని గుర్తించిన ఇల్లు కూల్చివేయబడింది.
బీజేపీ కమిటీ
ఇదే సమయంలో ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కోల్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాంలాల్ రౌటెల్ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యే శరద్ కోల్, ఎమ్మెల్సీ అమర్ సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతదేవ్ సింగ్ ఉన్నారు. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి త్వరితగతిన నివేదికను సమర్పిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా గిరిజనులపై మూత్ర విసర్జన చేయడం గమనార్హం. ఈ వీడియో బయటకు రావడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భిన్నమైన అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశ్ శుక్లాపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.