ఆయుధంతో ఇంటర్నేషనల్ బార్డర్ దాటుతున్న పాకిస్థానీయుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్.. ఎక్కడంటే ?

Published : Jan 03, 2023, 02:25 PM IST
ఆయుధంతో ఇంటర్నేషనల్ బార్డర్ దాటుతున్న పాకిస్థానీయుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్.. ఎక్కడంటే ?

సారాంశం

భారత్ - పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటుతున్న పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పి చంపారు. ఆయుధం పట్టుకొని బార్డర్ దాటుతున్న అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు ఆగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. 

పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దును దాటుతున్న పాకిస్థానీయుడిని బీఎస్‌ఎఫ్ మంగళవారం కాల్చి చంపింది. ఈ ఘటన గురుదాస్‌పూర్ సెక్టార్‌లో జరిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో చొరబాటును బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. బీఎస్ఎఫ్ బృందం పాకిస్తాన్ వైపు నుండి కంచెం వద్దకు వస్తుండగా సాయుధ పాకిస్తాన్ చొరబాటుదారుడి అనుమానాస్పద కదలికను గమనించింది.

‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అని పోతున్న పామును పట్టుకుని విన్యాసాలు.. కాటు వేయడంతో...

దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని అడ్డుకున్నాయి. బార్డర్ దాటవద్దని, అక్కడే నిలిచిపోవాలని బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని కోరారు. కానీ అతడు వినకపోవడంతో జవాన్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో విస్తృతంగా అన్వేషణ సాగుతోంది.

‘‘ ఈ సంవత్సరం పంజాబ్ సెక్టార్‌లో సరిహద్దులో ఇదే మొదటి ఎన్‌కౌంటర్. గతేడాది బీఎస్ఎఫ్ ఇద్దరు పాకిస్తాన్ చొరబాటుదారులను హతమార్చింది. 23 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే ఈ రోజు తెల్లవారుజామున టరాన్‌టర్న్ సెక్టార్‌లో డ్రోన్ కదలిక కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. యూఏవీ వద్ద పొగమంచు పరిస్థితులను ఉపయోగించుకొని పాకిస్తాన్ డ్రోన్‌లు, చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు.” అని ఒక అధికారి తెలిపారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించవచ్చునా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

కాగా.. సోమవారం తెల్లవారు జామున, గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని కస్సోవాల్ ప్రాంతంలో డిసెంబర్ 31న సైనికులు కాల్చిన డ్రోన్‌లో సుమారు 1 కిలోల హెరాయిన్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu