బాడీ షేమింగ్ చేస్తున్నాడని క్లాస్‌మేట్‌ను హత్య చేసిన బాలుడు.. పక్కా ప్లాన్‌తో..

By Sumanth KanukulaFirst Published May 17, 2022, 5:42 PM IST
Highlights

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన క్లాస్‌మేట్‌ను హత్య చేశాడు. అయితే తనను బాడీ షేమింగ్ చేయడమే కాకుండా.. తన కుటుంబాన్ని దుర్భాలాషడంతోనే ఈ హత్య చేసిన నిందితుడు ఆరోపించారు. 

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన క్లాస్‌మేట్‌ను హత్య చేశాడు. అయితే తనను బాడీ షేమింగ్ చేయడమే కాకుండా.. తన కుటుంబాన్ని దుర్భాలాషడంతోనే ఈ హత్య చేసిన నిందితుడు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అనంతరం అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. నిందితుడు తన స్నేహితుడిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రన్ తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన స్నేహితుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. బాధితుడు తన శరీరాకృతిపై కామెంట్ చేయడం, అనుచితంగా తాకడం, కుటుంబ సభ్యులను దూర్భాషలాడినట్టుగా నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే హత్య చేసినట్టుగా చెబుతున్నాడు. నిందితుడు, బాధితుడు ఇద్దరు కూడా ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే హత్యకు గురైన బాలుడు.. తరుచూ చెస్ట్ పెద్దగా ఉందని వేధించేవాడు. 

ఈ క్రమంలోనే నిందితుడు ఈ విషయాన్ని స్కూల్ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ టీచర్.. ఇలాగే వేధింపులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హత్యకు గురైన బాలుడిని హెచ్చరించింది. అయితే అతడు నిందితుడిని వేధించడం మానలేదు. ఈ క్రమంలోనే నిందితుడు అతడిని హత్య చేయాలని భావించాడు.

ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం పార్టీ ఉందని తన స్నేహితుడిని నిందితుడు ఆహ్వానించాడు. శనివారం సాయంత్రం సమయంలో అతడిని బైక్‌పై ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేస్తున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న కొడవలితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతడికి మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. అతడు నెలపై పడిపోయేవరకు కొడవలితో దాడి చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నిందితుడు అదే ఊరిలోని బంధువుల ప్లేస్‌కు వెళ్లిపోయాడు. 

Also Read: ఆర్థర్ రోడ్ జైలులో తోటి ఖైదీకి లైంగిక వేధింపులు.. 19 ఏళ్ల యువకుడిపై కేసు..

ఇక, ఆదివారం ఉదయం బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ హత్యకు సంబంధించిన విచారణలో హత్యకు గురైన వ్యక్తితో నిందితుడు చివరిసారిగా కనిపించినట్టుగా తేలింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడి తల్లిదండ్రులు.. అతడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అక్కడ నిందితుడు అంగీకరించాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరోవైపు ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన చేపట్టారు. నిందితుడు ఒక్కడే ఈ హత్య చేయలేదని.. దీని వెనక ఇతరుల పాత్ర కూడా ఉందని వారు ఆరోపిస్తున్నారు. 

click me!