పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

By ramya NFirst Published Mar 2, 2019, 12:00 PM IST
Highlights

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. 

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు.  ఈ ఘటన త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది.  

మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు.  భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.  దీంతో పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

click me!