పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

Published : Mar 02, 2019, 12:00 PM IST
పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

సారాంశం

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. 

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు.  ఈ ఘటన త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది.  

మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు.  భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.  దీంతో పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu