Kambala: జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

Published : Nov 26, 2023, 08:38 PM IST
Kambala: జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

సారాంశం

దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య జల్లికట్టు, కంబళ క్రీడలను సనాతన ధర్మంతో లంకె పెడుతూ మాట్లాడారు. ఈ క్రీడలను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుందని వివరించారు. ఆదివారం బెంగళూరులో విజయవంతంగా రెండో రోజు కంబళ క్రీడ నిర్వహించారు.  

Kambala: బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆదివారం కంబళ, జల్లికట్టు ఆటల గురించి మాట్లాడారు. ఈ ఆటలకు సనాతన ధర్మంతో లంకె ఉన్నదని వివరించారు.అన్ని పార్టీలు ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. సాంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబళను ఆపడానికి కొన్ని శక్తులు ఒక ఎజెండా ప్రకారం పని చేస్తున్నాయని ఆరోపించారు.

నీటిలో దున్నలను అతివేగంగా పరుగెత్తించే ఈ కంబళ ఆట ఈ రోజు బెంగళూరులో రెండో రోజుకు చేరుకుంది. సాధారణంగా ఈ క్రీడ కర్ణాటక తీర ప్రాంతాల్లో, కేరళలోని కాసర్‌గోడ్‌లో నిర్వహిస్తుంటారు. కంబళ బెంగుళూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కంబళ రాష్ట్ర క్రీడా హోదాను దక్కించుకుంది.

Also Read: Barrelakka: బర్రెలక్క వెనుక ఎవరు ఉన్నారు? గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది?

‘కొన్ని శక్తులు ఒక ఎజెండాతో జల్లికట్టు, కంబళను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కోర్టులకు వెళ్లుతున్నాయని, ఇతర మార్గాల్లో ఈ క్రీడాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని తేజస్వీ సూర్య అన్నారు. పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి జల్లికట్టు, కంబళను కాపాడుకోవాలని తెలిపారు. ఎందుకంటే ఈ క్రీడలను కాపాడుకుంటేనే సనాతన ధర్మాన్ని పరిరక్షించినవారం అవుతామని వివరించారు. ఈ క్రీడలో 178 మంది వారి దున్నలతో పాల్గొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood