బీజేపీ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తోంది.. : రాహుల్ గాంధీ

By Mahesh RajamoniFirst Published Jun 2, 2023, 9:47 AM IST
Highlights

Rahul Gandhi In US: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కాను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరుస్తోందనీ, ప్రతిపక్షాలను వేధిస్తోందని, ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని శనివారం ఆరోపించారు. అయితే, ఉక్రెయిన్-ర‌ష్యా వివాదంపై భార‌త్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైంద‌ని రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వ తీరును కొనియాడారు.
 

Rahul Gandhi In America: బీజేపీ విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తోందని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, భారత్ లో ఓపెన్ గా మాట్లాడే సంప్రదాయం ఉందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కాను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరుస్తోందనీ, ప్రతిపక్షాలను వేధిస్తోందని, ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. అయితే, ఉక్రెయిన్-ర‌ష్యా వివాదంపై భార‌త్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైంద‌ని రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వ తీరును కొనియాడారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ ఈ విషయంలో మోడీ స‌ర్కారు నిర్ణ‌యం స‌రైంద‌నీ,  తాము ఈ అంశంలో ప్రభుత్వం వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. "రష్యాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యాపై మనకు కొన్ని డిపెండెన్సీలు (డిఫెన్స్) ఉన్నాయి. కాబట్టి నా వైఖరి భారత ప్రభుత్వ వైఖరితో సమానంగా ఉంటుంది. అన్నింటికీ మించి, మన ఆసక్తులను కూడా మనం చూసుకోవాలి" అని అన్నారు. 

భారత సంబంధాలను ఇతరులు నిర్ణయించలేరు.. 

భారత్ చాలా పెద్ద దేశమనీ, అనేక దేశాలతో దాని సంబంధాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. కొన్ని దేశాలతో సత్సంబంధాలు, ఇతర దేశాలతో సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఇది సమతుల్యత, కానీ ఈ సమూహంతో భారతదేశానికి సంబంధాలు ఉండవని చెప్పడం భారతదేశానికి కష్టం. యావ‌త్ ప్ర‌పంచంతో భార‌త్ సంబంధాలు ఉంటాయ‌ని తెలిపారు. 

చైనా గురించి మాట్లాడుతూ.. 

అప్రజాస్వామిక చైనాను ఎదుర్కోవడానికి ఒక విజన్ తో ముందుకు రావడంలో ప్రజాస్వామ్య ప్రపంచం విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్పత్తి, తయారీ కోసం కొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. దీనిలో అమెరికా-భారతదేశం కలిసి పనిచేయగలవని నొక్కి చెప్పారు. వచ్చే పదేళ్లలో చైనాతో భారత్ సంబంధాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌పై చైనా ఏమీ విధించదనీ, భారత్‌-చైనాల మధ్య సంబంధాలు అంత సులభం కాదనీ, అవి కష్టంగా మారుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే చైనా త‌మ భూభాగాల‌ను ఆక్ర‌మించే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌నీ, స‌రిహ‌ద్దు వివాదాలు తొల‌గిపోతేనే ఇత‌ర సంబంధాలు స‌జావుగా కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

బీజేపీ విమ‌ర్శ‌ల దాడి.. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. విద్వేషాన్ని రెచ్చగొట్టాలని, సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారని, అవి సమ్మిళితం కావని అన్నారు. భారత్ లో ఓపెన్ గా మాట్లాడే సంప్రదాయం ఉందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. గొప్ప నాయకులు, ఆధ్యాత్మిక, రాజకీయ ప్రముఖుల ఉదాహరణలను ఉటంకిస్తూ, వారు (కాంగ్రెస్) శాంతి, సామరస్యం, సంభాషణను ప్రోత్సహించారని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఈ సంభాషణలు జరపడం మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్రలో ఉందనీ, ఇది త‌మ‌కు (కాంగ్రెస్)-వారికి (బీజేపీ) మధ్య తేడా అని తాను అనుకుంటున్నాన‌ని చెప్పారు. భారతదేశానికి పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమనీ, విమర్శలకు సిద్ధంగా ఉండాలని, విమర్శలను వినాలని, అదే ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తుందని ఆయన అన్నారు.

click me!