‘50% కమీషన్’ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై ఫిర్యాదు

Published : Aug 13, 2023, 04:28 PM IST
‘50% కమీషన్’ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై ఫిర్యాదు

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా పోస్ట్‌ చేసింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్ లపై ఫిర్యాదు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలే ఆమెను చిక్కుల్లో పడేలా చేశాయి. 

మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టర్ల నుండి అధికారులు 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు బీజేపీ నేతలు జబల్‌పూర్ హైకోర్టుకు ఈ లేఖ రాసినట్లు సమాచారం. తప్పుడు ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రియాంక గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, అరుణ్ యాదవ్, కాంగ్రెస్ నేత శోభా ఓజా, జ్ఞానేంద్ర అవస్తీలపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేశారు.  

కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ నేతలందరిపై వందల కొద్దీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవచ్చు. 
మధ్యప్రదేశ్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా.. అవినీతిని లేవనెత్తే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి అలవాటుగా మారిందని, అయినా తాము భయపడబోమని అన్నారు. ఈ విషయాలన్నింటిలో తాము అవినీతి సమస్యను లేవనెత్తుతామనీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. 
 
మధ్యప్రదేశ్‌లో అవినీతి వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు 50 శాతం కమీషన్ ఇచ్చిన తర్వాతే చెల్లింపులు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు లేవనెత్తారు. క్రైమ్‌ బ్రాంచ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ) శృతకీర్తి సోమవంశీ మాట్లాడుతూ.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం ప్రథమ సమాచార నివేదికను నమోదు చేస్తామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu