నీతి ఆయోగ్ మీటింగ్ కు దూరంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ !

Published : Aug 07, 2022, 02:01 AM IST
నీతి ఆయోగ్ మీటింగ్ కు దూరంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ !

సారాంశం

Niti Aayog meeting: ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ సైతం నీతి ఆయోగ్ మీటింగ్ ను దాటవేయ‌నున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.   

Bihar Chief Minister Nitish Kumar: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి (Niti Aayog meeting) బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరయ్యే అవకాశం ఉందని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయం తెలిసిన ప‌లువురు అధికారులు సైతం శనివారం నాడు దీని గురించి వెల్ల‌డించిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, నితీష్ కుమార్ ఈవెంట్‌ను దాటవేస్తే, అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగమైనప్పటికీ, ఒక ప్రధాన ప్రభుత్వ ఈవెంట్‌కు ఇది ఒక నెలలోపు గైర్హాజరు కావడం ఇది రెండోది కానుంది. అంతకుముందు, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోసం ప్రధాని మోడీ ఇచ్చిన విందుతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయ‌న‌ దూరంగా ఉన్నారు.

నితీష్ కుమార్ గైర్హాజరు కావడానికి ప్రభుత్వ అధికారి ఎటువంటి అధికారిక కారణం చెప్పలేదు కానీ ముఖ్య‌మంత్రి ఇప్పుడే కోవిడ్ -19 నుండి కోలుకున్నందున, బదులుగా తన డిప్యూటీని పంపాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ సమావేశం కేవలం ముఖ్య‌మంత్రుల‌కు సంబంధించిన‌ది కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, కుమార్ తన వారపు 'జనతా కే దర్బార్ మే ముఖ్యమంత్రి' కార్యక్రమాన్ని నెలలో మూడు సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 8న కుమార్ తన జనతా దర్బార్‌ను నిర్వహించనున్నట్లు క్యాబినెట్ సెక్రటేరియట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయ‌న  సమావేశానికి గైర్హాజరు కావడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ఉన్న సంబంధాలకు సంబంధించిన పరిణామాలపై ఏన్డీయే నాయకులు చ‌ర్చించుకుంటున్నారు. 

“2024 లోక్‌సభ, 2025 ఎన్నికలలో JD (U)తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా గత రోజు పాట్నాలో ప్రకటించినప్పటికీ, రెండు పార్టీల మధ్య అపనమ్మకం ఉంది. JD (U) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ 2024, 2025 గురించి నిబద్ధత లేకుండా ఉన్నారు”అని కోట్ చేయడానికి ఇష్టపడని ఓ బీజేపీ సీనియర్ నాయకుడు పేర్కొన్నార‌ని హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా నితీష్ కుమార్ దూరంగా ఉండి.. తన డిప్యూటీని పంపారు. “రాష్ట్రంలో నాయకత్వాన్ని కనుగొనడంలో బీజేపీ కష్టపడుతుండగా.. బీజేపీపై ఒత్తిడిని పెంచ‌డానికి జేడీ(యూ) మార్గాలును చూస్తోంది. వారికి ఇప్పుడు కేబినెట్‌లో మరిన్ని బెర్త్‌లు కావాలి” అని పాట్నా యూనివర్శిటీ మాజీ హెచ్‌వోడీ ఆఫ్ ఎకనామిక్స్, రాజకీయ నిపుణులు ఎన్‌కే చౌదరి అన్నారు.

అయితే, ఏన్డీయే కూట‌మిలో భాగంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), జేడీ(యూ)ల మ‌ధ్య బంధం క్షీణిస్తున్న‌ద‌ని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ త‌మ‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జేడీ (యూ) నేత‌లు భావిస్తున్నార‌ట‌. అలాగే, రాష్ట్రంలో.. కేంద్రంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌లు ప‌రిణామాలు సైతం ఈ రెండు పార్టీల మ‌ధ్య దూరం పెంచేవిధంగా మారాయి స‌మాచారం.  చూడాలి మరి మున్ముందు  ఈ రెండు పార్టీల మైత్రీ ఎక్కడికి చేరుకుంటుందో..!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu