స్కూటీపై వెళ్తూ ఆన్‌లైన్‌లో మీటింగ్ కు: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

By narsimha lodeFirst Published Mar 25, 2024, 10:52 AM IST
Highlights

ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ టెక్కీ  స్కూటీపై వెళ్తూ  ల్యాప్ టాప్ లో  సమావేశానికి హాజరయ్యాడు.  

బెంగుళూరు: స్కూటీపై ల్యాప్ టాప్ సహాయంతో  మీటింగ్  కు హాజరైన  టెక్కీ వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  రోడ్డుపై  బండి నడుపుతూ  ల్యాప్ టాప్ సహాయంతో  సమావేశానికి హాజరు కావడంపై  కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.   బెంగుళూరు ప్రారంభకులకు కాదు అనే క్యాప్షన్ తో  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఐటీ కంపెనీల్లో  పని సంస్కృతి గురించి ఈ వీడియోను చూసిన కొందరు  సెటైర్లు వేశారు.  ప్రస్తుత పోటీ వాతావరణంలో  ఎదుర్కొంటున్న  ఒత్తిడికి ఈ వీడియో నిదర్శనంగా  మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. వారానికి  70 గంటల సమయం తక్కువగా ఉండొచ్చు... అతను ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.

 

Bengaluru is not for beginners 😂

(🎥: ) pic.twitter.com/mgtchMDryW

— Peak Bengaluru (@peakbengaluru)

జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ఎంత కాలం తమ సమయాన్ని వెచ్చిస్తారో ఈ వీడియో వెలుగులోకి తెచ్చింది.గతంలో సినిమాహలులో ల్యాప్ టాప్ తో పనిచేస్తున్న వ్యక్తి వీడియో కూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
 

click me!