లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి

Published : Jun 18, 2019, 05:40 PM IST
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి

సారాంశం

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.  

న్యూఢిల్లీ:  లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

బెంగాల్ రాష్ట్రం నుండి  ఐదు దఫాలు అధీర్ చౌదరి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బెంగాల్ పీసీసీ చీఫ్ గా కూడ ఆయన పనిచేశారు.  యూపీఏ 2 లో అధీర్ చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 

గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా  వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే  ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరు.  దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ ను ఎన్నుకొన్నారు.  


 

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu