ప్రధాని మోడీకి మమతా బెనర్జీ కృతజ్ఞతలు.. కేంద్రానికి సహకరిస్తానన్న దీదీ

By Siva KodatiFirst Published May 5, 2021, 9:40 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పడంపై దీదీ స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పడంపై దీదీ స్పందించారు. బెంగాల్‌కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉండాలని మమత ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా దీదీకి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Also Read:బస్సులు, లోకల్ రైళ్లు రద్దు.. కర్ఫ్యూ తరహా ఆంక్షలు: కరోనాపై దీదీ యాక్షన్

దీనిపై మమతా బెనర్జీ సమాధానమిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే  బెంగాల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి నిరంతర సాయం లభిస్తుందని సీఎం ఆకాంక్షించారు. కేంద్రానికి తన పూర్తి సహకారం ఉంటుందని.. మహమ్మారి సహా ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడాలనీ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

 

 

Thank you ji for your wishes.

I look forward to the Centre's sustained support keeping the best interest of WB in mind.

I extend my full cooperation & hope together we can fight this pandemic amid other challenges & set a new benchmark for Centre-State relations. https://t.co/DORcTPb2UG

— Mamata Banerjee (@MamataOfficial)
click me!