ఫేస్ బుక్ లో మహిళతో స్నేహం.. అత్యాచారం చేసి.. బలవంతంగా మతమార్పిడి...!!

Published : Jul 24, 2023, 02:42 PM IST
ఫేస్ బుక్ లో మహిళతో స్నేహం.. అత్యాచారం చేసి.. బలవంతంగా మతమార్పిడి...!!

సారాంశం

మహిళ మీద అత్యాచారం చేసిన తర్వాత మతం మార్చుకోవాలని నిందితులు ఒత్తిడి చేశారు. మతం మార్చడానికి మసీదుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఘజియాబాద్ : ఘజియాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన మహిళ మీద ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఇస్లాం మతంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్‌లో నకిలీ పేరుతో నిందితులు తనను మోసం చేశారని మహిళ తెలిపింది. పరిచయంతో సన్నిహితంగా మారిన తరువాత కలవాలనుకుంటున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో.. ఓ ప్రదేశంలో ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడ ఆమె మీద సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కెనడాలో భారతీయ విద్యార్థి మృతి.. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలై...

ఘజియాబాద్ నివాసి అయిన మహిళ, ఆ తర్వాత తాను గర్భవతి అయ్యానని, అయితే ఆ వ్యక్తి బలవంతంగా అబార్షన్ చేయించాడని పేర్కొంది. ఆ వ్యక్తి పేరు ఖలీద్ అని, అతను తన మతం గురించి అబద్ధం చెప్పాడని అప్పుడే తెలిసిందని ఆమె చెప్పింది.

తన మతంలోకి మారాలని ఖలీద్ తనపై తీవ్రమైన ఒత్తిడి చేశాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని ఓ మసీదుకు తీసుకెళ్లి బలవంతంగా మతమార్పిడి చేశాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఖలీద్ తనని తాను జర్నలిస్టుగా చెప్పుకున్నాడని కూడా ఆ మహిళ చెప్పింది.

ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఖలీద్‌పై ఐపీసీ సెక్షన్లు 376, 313, 323, మరియు 509 కింద కేసు నమోదు చేశారు. తరువాత కలీద్ ను విజయ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Tourism : ఏమిటీ.. 2025 లో 135 కోట్ల పర్యాటకులా..! ఆ ప్రాంతమేదో తెలుసా?
Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu