అంతర్జాతీయ విమానాల రాకపోకలపై జూలై 31 వరకు నిషేధం

Published : Jul 03, 2020, 04:16 PM IST
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై జూలై 31 వరకు నిషేధం

సారాంశం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ నెల 31వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తూ శుక్రవారం నాడు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.


న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ నెల 31వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తూ శుక్రవారం నాడు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా ఆన్ లాక్ 2 ప్రక్రియలో భాగంగా పలు రంగాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తుంది ప్రభుత్వం. అయితే దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది ప్రభుత్వం.

కార్గో విమానాలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇస్తున్నట్టుగా డీజీసీఏ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని జూలై 15వ తేదీ వరకు విధిస్తున్నట్టుగా డీజీసీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నెలాఖరువరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీఏ.

Also read:అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 15 వరకు నిషేధం: డీజీసీఏ

వందే భారత్ మిషన్ కింద ఎయిరిండియా, ఇతర ప్రైవేట్ దేశీయ విమానాలు ఈ ఏడాది మే 6వ తేదీ నుండి ఇతర దేశాల్లోని భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు నడుస్తున్నాయి.

దేశంలో డొమెస్టిక్ విమానాలు ఈ ఏడాది మే 25వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. రెండు మాసాల లాక్ డౌన్ తర్వాత డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించారు. సోషల్ డిస్టెన్సింగ్ కఠినమైన నిబంధనల మధ్యలో డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించింది డీజీసీఏ.
 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families