
Australian PM Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ లో అమల్లోకి వచ్చిన ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ) నేపథ్యంలో ఆరేళ్లలో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధానితో పాటు ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్ ఫారెల్, ఉత్తర ఆస్ట్రేలియా మంత్రి మెడెలిన్ కింగ్, ఇతర సీనియర్ అధికారులు ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది.
తన పర్యటనకు ముందు ఆంథోనీ అల్బనీస్ బుధవారం ట్విటర్ వేదికగా 'ఈ రోజు నేను మంత్రులు, వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందాన్ని భారత్ కు తీసుకువస్తున్నాను. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు అహ్మదాబాద్, ముంబయి, న్యూఢిల్లీలో పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, తమ ప్రాంతంలో అసాధారణ వృద్ధి, చైతన్యం ఉన్న సమయంలో భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చారిత్రాత్మక అవకాశం లభించిందని తెలిపారు.
భారత పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియాలో రేర్ ఎర్త్ సెక్టార్ లో గణనీయమైన పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయంపై కాబిల్ (ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్) ఆస్ట్రేలియాలో రేర్ ఎర్త్ సెక్టార్ లో గణనీయమైన పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది, ఈ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం-భారత ప్రభుత్వం, ముఖ్యంగా వ్యాపార సమాజం స్వాగతించిందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉన్నాయని, ఈ విషయంలో పలు చర్యలు చేపట్టాయని తెలిపారు. 2022 ఫిబ్రవరిలో, భారతదేశం-ఆస్ట్రేలియా కొత్త-పునరుత్పాదక శక్తిపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పై సంతకం చేశాయి, ఇది పునరుత్పాదక శక్తి (ఆర్ఇ) సాంకేతికతల వ్యయాన్ని తగ్గించడానికి సహకారాన్ని అందిస్తుంది, ముఖ్యంగా అల్ట్రా-లో-కాస్ట్ సోలార్ అండ్ క్లీన్ హైడ్రోజన్ అంశాలు ఉన్నాయి. తన పర్యటనలో ప్రధాని మోడీతో జరిగే భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నట్టు సమాచారం.
ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన షెడ్యూల్