అక్రమ మద్యం విక్రయంపై సమాచారం అందించడాని ఓ మహిళ డీఎంకే కార్యకర్తపై పగ తీర్చుకుంది. అతడిని నరికి చంపి డెడ్ బాడీని వీధిలో వదిలేసి పారిపోయింది.
అక్రమంగా మద్యం అమ్ముతోందని పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కోపంతో ఓ డీఎంకే నాయకుడిని ఓ మహిళ నరికి చంపింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పిడుగుపాటులో 18 మంది మృతి.. 4 లక్షల సాయం ప్రకటించిన సర్కారు
సోమంగళంలో ప్రాంతంలోని నడువీరపట్టులోని ఎట్టయ్యపురానికి చెందిన సతీష్ (31) డీఎంకే కార్యకర్త. నడువీరపట్టుకు కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన లోకేశ్వరి అలియాస్ ఎస్తేర్ (45) గతంలో వ్యభిచార రాకెట్ ను నడిపారు. అయితే కొంత కాలంగా ఆమె అక్రమంగా మద్యం విక్రయిస్తోంది. ఇది తప్పని, ఇలా అక్రమంగా మద్యం విక్రయించకూడదని ఆమెను సతీష్ పలు మార్లు హెచ్చరించాడు.
సరదా కోసం కాబోయే భార్య నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్.. కొట్టి చంపిన ఆమె స్నేహితులు
అయినా కూడా ఆ మహిళలో మార్పు రాలేదు. అలాగే మద్యం అమ్మేది. దీంతో సతీష్ పోలీసులకు సమాచారం చేరవేసి, ఆమెపై ఫిర్యాదు చేశాడు.దీంతో లోకేశ్వరి ఆదాయం ఆగిపోయింది. అందరూ ఆమె నుండి మద్యం కొనడం మానేశారు. ఈ విషయంపై కోపం తెచ్చుకున్న ఆ మహిళ సతీస్ ను చంపేయాలని నిర్ణయించుకుంది.
భారత్ జోడో ప్రచారానికి నితీష్, తేజస్వి యాదవ్.. ఆహ్వానం పలికిన కాంగ్రెస్
ఈ క్రమంలో సోమవారం సతీష్ను తన ఇంటికి ఆహ్వానించిన లోకేశ్వరి తలుపులు వేసి అతడిని కొడవలితో నరికి చంపింది. అనంతరం మహిళ మృతదేహాన్ని ఇంటి బయటికి ఈడ్చుకెళ్లి బయట పడేసింది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదృశ్యమైన లోకేశ్వరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. చెక్ పోస్ట్ లను అలర్ట్ చేశారు.
DMK panchayat member of Naduveerapattu / Somangalam hacked to death by woman bootlegger near
Sathish Lokeshwari pic.twitter.com/wwkftfehig