బీడీ కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు..!

Published : Feb 24, 2022, 09:39 AM ISTUpdated : Feb 24, 2022, 10:12 AM IST
బీడీ కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు..!

సారాంశం

దీంతో.. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో సదరు యువకుడు తండ్రిని కిరాతకంగా దాడి చేశాడు.

బీడీ కోసం ఓ వ్యక్తి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని బార్పేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. కన్న తండ్రిని హత్య చేశాడు.

 యువకుడు.. తన తండ్రిని బీడీ కావాలని అడిగాడు. అతను వెంటనే కొడుక్కి ఒక బీడీ ఇచ్చాడు. అయితే.. ఒకటి సరిపోదని మరో బీడీ కావాలని అడిగాడు. రెండో బీడీ ఇవ్వడానికి తండ్రి అంగీకరించలేదు. దీంతో.. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో సదరు యువకుడు తండ్రిని కిరాతకంగా దాడి చేశాడు.

ఈ దాడిలో  తీవ్రంగా గాయపడిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 


 

PREV
click me!

Recommended Stories

స్వాతంత్రం వ‌చ్చిన వెంట‌నే గ‌ణ‌తంత్రం ఎందుకు రాలేదో తెలుసా.? రిప‌బ్లిక్ డే గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు.
Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu