Target Killing Kashmir: కాశ్మీరీ లోయలోని కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆరోపించారు. పండిట్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, ప్రభుత్వం వారికి భద్రత కల్పించడంలో విఫలమైనందున పండిట్లు ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నారని పేర్కొన్నారు.
Target Killing Kashmir: కశ్మీర్ లోయ మంగళవారం మరోసారి దద్దరిల్లింది. కశ్మీరీ పండిట్లను చంపడమే లక్ష్యంగా దాడి చేశారు. ఇద్దరు సోదరులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక సోదరుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక సోదరుడు గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఈ దాడి తర్వాత.. కాశ్మీరీ పండిట్లు మరోసారి భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శాస్త్రాలను సంధిస్తున్నారు. కశ్మీరీ పండిట్ల దాడిపై బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటికీ, లోయలోని కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జమ్మూకశ్మీర్లో ఎల్జీని బీజేపీ నియమించిందని, కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కశ్మీర్లో శాంతి నెలకొంటుందని ఆర్టికల్ 370ని తొలగించారు. కాశ్మీరీ పండిట్లు స్థిరపడతారనీ ఇక్కడికి తీసుకొచ్చి ఇష్టానుసారంగా వదిలి వేశారని ఆరోపించారు.
'కశ్మీరీ పండిట్లు కాశ్మీర్ను విడిచి వెళ్లాలనుకుంటున్నారు'
ఆశాంతి, హింసయుత కాశ్మీర్ను నుంచి కాశ్మీర్ పండిట్లు విడిచిపెట్టాలని కోరుకుంటున్నారనీ, కానీ.. ప్రభుత్వం వారిని అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే తాళాలు వేసి ఉంచుతున్నారని ఆరోపించారు. కాశ్మీరీ పండిట్ల జీవితాలను రక్షించే బాధ్యత బిజెపి ప్రభుత్వంపై ఉందనీ, కానీ..ఈ విషయంలో కేంద్రం విఫలమైందని నిరూపించబడిందని అన్నారు. జమ్మూకశ్మీర్లో కాశ్మీరీ పండిట్లపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదని, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు కాశ్మీర్ను విడిచిపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో ఉదాహరణ అని ఏఐఎంఐఎం చీఫ్ ఒవైసీ అన్నారు.
కశ్మీర్ను స్మశాన వాటికగా మార్చాలని పాకిస్థాన్ భావిస్తోంది.
అదే సమయంలో.. ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా సంధించారు. 'పిరికిపంద పాకిస్తానీ ఉగ్రవాదులు మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇద్దరు కాశ్మీరీ సోదరులను పిరికి పాకిస్తానీ ఉగ్రవాదులచే కాల్చివేశారు. కశ్మీర్లో పాకిస్థాన్ రక్తపాతాన్నికోరుకుంటోంది. కాశ్మీర్ ప్రజలకు శత్రువులు, ఆ ప్రాంతాన్ని( కాశ్మీర్ను) స్మశాన వాటికగా మార్చాలని పాకిస్థాన్ కోరుకుంటోందని, అయితే.. దాని దుర్మార్గపు డిజైన్లను నెరవేర్చడానికి, దానిని అనుమతించబోమని ఆయన అన్నారు. షోపియాన్ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.
ఒమర్ అబ్దుల్లా సంతాపం
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దక్షిణ కాశ్మీర్ నుండి ఈరోజు చాలా విచారకరమైన వార్త వచ్చింది. తీవ్రవాద దాడి మరణం మరియు బాధను మిగిల్చింది. షోపియాన్లో జరిగిన ఉగ్రదాడిలో సునీల్ కుమార్ మృతి చెందగా, పింటో కుమార్కు గాయాలు కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కుటుంబానికి నా సానుభూతి. అని ట్వీట్ చేశారు.