75 కిలోల మిరపపోడిని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం

Siva Kodati |  
Published : Aug 02, 2019, 08:54 AM IST
75 కిలోల మిరపపోడిని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం

సారాంశం

ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లి కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. అనంతరం 75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం చేశారు. 

భారతదేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అన్నప్పటికీ అవి యధావిథిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి వాటి కోవలోనే తాజాగా తమిళనాడులో జరిగింది.

ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లి కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం 75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం చేశారు. ప్రతి ఏటా ఆడి అమావాస్య సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దేవాలయంలో ఆనవాయితీగా వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే