అంబానీ ఇంటి వద్ద యూఎస్‌వీ కేసు: వాజే గురువు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

By Siva KodatiFirst Published Jun 17, 2021, 3:00 PM IST
Highlights

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని నిలిపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచార‌ణ చేప‌ట్టింది. దీనిలో భాగంగా మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్‌ శ‌ర్మ ఇంట్లో ఆరుగంటల పాటు సోదాలు చేప‌ట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని నిలిపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచార‌ణ చేప‌ట్టింది. దీనిలో భాగంగా మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్‌ శ‌ర్మ ఇంట్లో ఆరుగంటల పాటు సోదాలు చేప‌ట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.

అంధేరీలోని ప్రదీప్‌ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్‌పీఎఫ్ అధికారులు తనీఖీలు నిర్వహించారు. ఈ కేసులో షీల‌ర్ అనే అనుమానితుడితో శ‌ర్మ గతంలో దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న‌ పాత్రపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. షీల‌ర్ గ‌తంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్‌ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా.

Also Read:ఆ మంత్రులు తోడు దొంగలు: సచిన్ వాజే సంచలన ఆరోపణలు.. వివాదంలో మరో ‘‘అనిల్’’

అటు మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయ‌న్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేప‌ట్టిన‌ట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇదే కేసులో ఎన్‌ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్‌స్పెక్టర్ స‌చిన్ వాజేకు, శ‌ర్మ గురువుగా చెబుతుంటారు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహ‌నంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శ‌ర్మ ద్వార‌నే తెప్పించిన‌ట్లు వాజే స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు ఎస్‌యూవీ యజమాని మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర పోలీస్ వర్గాల్లో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌ శర్మపై 2006లో లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్, ఈ ఘటనలో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లో చేరిన ప్రదీప్ శర్మ 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం శివ‌సేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తన పేరిట ఓ ఎన్జీవో నడుపుతున్నారు . 

click me!