ఆర్య సమాజ్ ఇచ్చే వివాహ ధృవీకరణ పత్రం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తెలిపింది. ఆ సమాజంలో చేసుకున్నవారు తమ పెళ్లిళ్లు కచ్చితంగా రిజిస్టర్ కావాలన్న నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది.
వివాహాన్ని ధృవీకరించడానికి ఆర్యసమాజ్ ఇచ్చే వివాహ ధృవీకరణ పత్రం సరిపోదు. కచ్చితంగా పెళ్లిళ్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. అలాగే.. వివాహ ధృవీకరణ పత్రాలతో భారీగా కోర్టులకు వస్తున్నారనీ, వివిధ కేసుల్లో ఆ వివాహ ధృవీకరణ పత్రాలను కోర్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయని కోర్టు పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. భోలా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి నిరూపించుకునేందుకు ఆర్య సమాజ్ ఇచ్చిన సర్టిఫికేట్ను సమర్పించారు. తన భార్యను తిరిగి పొందడానికి ఘజియాబాద్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖాలు చేశారు. ఈ సమయంలో ఆర్యసమాజ్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు.. కొన్ని ఫోటోలను సాక్ష్యంగా సమర్పించారు. ఈ పిటిషన్ను జస్టిస్ సౌరబ్ శ్యామ్ శ్యామ్శేరి నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్స్ తో భారీ సంఖ్యలో బాధితులు కోర్టుకు వస్తున్నారని, వివిధ సందర్భంల్లో కోర్టులు వాటి వాస్తవికతను ప్రశ్నిస్తూనే ఉన్నాయని అన్నారు.
ఆర్యసమాజ్ సొసైటీ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాలతో కోర్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, కానీ వివిధ కేసుల్లో ఆ వివాహ ధృవీకరణ పత్రాలను కోర్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయని బెంచ్ పేర్కొంది. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా, వివాహాల నిర్వహణలో ఆర్యసమాజ్ నమ్మకాలను దుర్వినియోగం చేస్తోందని కోర్టు పేర్కొంది. వివాహం నమోదు కానందున, ఆర్యసమాజ్ సర్టిఫికేట్ ఆధారంగా పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేమని, డాక్యుమెంట్లకు విలువ ఇవ్వడం లేదని కోర్టు పేర్కొన్నది
పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం పిటిషనర్లకు ఇతర పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయని జస్టిస్ సౌరభ్ శ్యామ్ షంషేరి డివిజన్ బెంచ్ పేర్కొంది. అందువల్ల, హెబియస్ కార్పస్ కోసం ప్రస్తుత రిట్ పిటిషన్ నిర్వహించదగినది కాదనీ, పిటిషన్ను కొట్టివేశారు. అంతేకాకుండా, హెబియస్ కార్పస్ అనేది ప్రత్యేక హక్కు, అసాధారణమైన పరిష్కారం. ఇది హక్కుగా ఉపయోగించబడదని పేర్కొన్నారు.