సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం: ఏపీ నుంచి ముందుగా ఆమె

Siva Kodati |  
Published : Jun 17, 2019, 08:11 AM IST
సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం: ఏపీ నుంచి ముందుగా ఆమె

సారాంశం

17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అనంతరం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది.

ముందుగా ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు, ప్యానల్ ఛైర్మన్లు,  ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

తొలుత అండమాన్ నికోబార్ ఎంపీ... ఆ తర్వాత రెండో స్థానంలో ఎపీ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఈ క్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

National News: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 14,115 కోట్ల ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్
Petrol Price Cut : ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందంటే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు