Air India:  ఎయిర్ ఇండియా నయా లోగో..

Published : Aug 10, 2023, 08:30 PM IST
 Air India:  ఎయిర్ ఇండియా నయా లోగో..

సారాంశం

Air India:  ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌ కైవసం చేసుకున్న తరువాత రీబ్రాండింగ్‌కు వెళుతుంది. ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియా పాత లోగో ను మార్చింది. దాని స్థానంలో కొత్త లోగోను మార్చింది.

Air India: ఎయిర్ ఇండియా కొత్త లోగో తెరపైకి వచ్చింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా రీబ్రాండింగ్ చేసింది. టాటా తన బ్రాండ్ రంగులు, లోగో, ఇతర గుర్తులతో ఎయిర్ ఇండియా తన లోగోను ప్రారంభించింది. ఎయిరిండియా కొత్త లోగో ఆగస్టు 10న జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయబడింది. టాటాల చేతుల్లోకి తిరిగి వచ్చినప్పటి నుండి.. ఎయిర్ ఇండియాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

కొత్త లోగోలో ఎరుపు, తెలుపుతో పర్పుల్ రంగు ఉపయోగించింది. టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిరిండియా అంటే నాకు వ్యాపారం కాదని, నాకు ప్యాషన్ అని అన్నారు. టెక్నాలజీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్‌పై చాలా కృషి ఉంటుందని తెలిపారు. 

ఈ పని కోసం ఎయిర్ ఇండియా తన అత్యుత్తమ బృందాన్ని నియమించింది. ఎయిర్ ఇండియా వైపు నుండి ఫ్లీట్‌లో చాలా పనులు జరుగుతున్నాయి. విమానాల సంఖ్యను పెంచేందుకు విమానయాన సంస్థ పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చింది. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నామని, రానున్న 9 నుంచి 12 నెలల్లో అత్యుత్తమ సాంకేతికతను అందిపుచ్చుకుంటామన్నారు.

జనవరి 2022లో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేసిన నాటి నుంచి రీబ్రాండింగ్‌ చేస్తుంది. టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, టాటా సన్స్ ఎయిర్‌లైన్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం ఎయిర్ ఇండియా, టాటా సన్స్  మరొక అనుబంధ సంస్థ విస్తారాలను విలీనం చేసి మరింత ఏకీకృత సంస్థను రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ విలీన ప్రక్రియ మార్చి 2024 నాటికి పూర్తవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!