ఎఐఎడీఎంకె కీలక నిర్ణయం:ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై

Published : Sep 25, 2023, 05:45 PM ISTUpdated : Sep 25, 2023, 06:02 PM IST
ఎఐఎడీఎంకె కీలక నిర్ణయం:ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై

సారాంశం

ఎన్ ‌డీఏ తో  అన్నాడీఎంకె తెగదెంపులు చేసుకుంది. ఇవాళ జరిగిన అన్నాడీఎంకె కార్యవర్గ సమావేశంలో  అన్నాడీఎంకే ఈ మేరకు తీర్మానం చేసింది.

చెన్నై: ఎన్‌డీఏ కూటమికి అన్నాడీఎంకె గుడ్ బై చెప్పింది. సోమవారంనాడు జరిగిన ఎఐఏడీఎంకె కార్యవర్గ సమావేశంలో  ఈ మేరకు ఏకగీవ్రంగా తీర్మానం చేశారు.   గత కొంతకాలంగా  రాష్ట్రంలో బీజేపీ నేతలు అన్నాడిఎంకె నేతలపై  విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది.  ఎన్‌డీఏ నుండి బయటకు రావడానికి బీజేపీ నేతల వైఖరే కారణమని ఎఐఏడీఎంకె నేతలు ప్రకటించారు.

బీజేపీతో పొత్తుపై  చర్చించేందుకు  ఎఐఏడీఎంకె  ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి అధ్యక్షతన ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యదర్శులు,  ఎమ్మెల్యేలు,ఇతర కీలక నేతలతో  సోమవారంనాడు ఆ పార్టీ సమావేశం నిర్వహించింది.అన్నాడీఎంకెపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ  ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేయడాన్ని  అన్నాడీఎంకె సమావేశం తప్పుబట్టింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నాడీఎంకె సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత  ఆ పార్టీ కార్యాలయం వెలుపల సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై  అన్నాడీఎంకె నేతలు మండిపడ్డారు. ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఆ పార్టీ నేతలు  శుక్రవారంనాడు జేపీ నడ్డా,పీయూష్ గోయల్ లను కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.  

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !