పెళ్లి ఊరేగింపులో అమరవీరులకు నివాళి..వధూవరులపై ప్రశంసలు

Siva Kodati |  
Published : Feb 18, 2019, 12:21 PM IST
పెళ్లి ఊరేగింపులో అమరవీరులకు నివాళి..వధూవరులపై ప్రశంసలు

సారాంశం

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశ ప్రజలు ఘన నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు మౌన ప్రదర్శనల ద్వారా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశ ప్రజలు ఘన నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు మౌన ప్రదర్శనల ద్వారా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

తాజాగా పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు నివాళుర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు నూతన వధూవరులు. వివరాల్లోకి వెళితే..  గుజరాత్‌లోని వడోదరాకు చెందిన కొత్తజంట, తమ  వివాహానికి ముందు జరిగిన పెళ్లీ ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చొన్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు.

దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు. 13 లక్షల పులులు దేశ సరిహద్దులో కాపలా కాస్తున్నాయని ఆ ఫ్లకార్డులో పేర్కొన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే కాకుండా వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతపట్టుకుని జవాన్లకు నివాళులర్పించారు. 

 

PREV
click me!

Recommended Stories

Amaravati : థార్ కారు, కట్టల కొద్దీ డబ్బులు.. ఆడబిడ్డలను వేధించిన నీచుడికి ఇంత లగ్జరీ లైఫా..!
PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu