నెక్స్ట్ ఏం చేస్తారు? బీజేపీయేతర రాష్ట్రాలనూ అదుపులోకి తీసుకుంటారా?: కేంద్రంపై రాఘవ్ చద్దా విమర్శలు

Published : May 20, 2023, 02:32 PM IST
నెక్స్ట్ ఏం చేస్తారు? బీజేపీయేతర రాష్ట్రాలనూ అదుపులోకి తీసుకుంటారా?: కేంద్రంపై రాఘవ్ చద్దా విమర్శలు

సారాంశం

ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారుల బదిలీలు, నియామకాలపై నిర్ణయాధికారం ఉంటుంది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఘాటుగా విమర్శలు చేశారు.  

న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలనాపరమైన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండదని సుప్రీంకోర్టు ఇటీవలే ఓ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పక్కనపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనూ తమ అదుపులోకి తీసుకుంటారా? అని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాన్ని ఇచ్చింది. బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులపై నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుందని వివరించింది.

 

Also Read: హెల్మెట్ ధరించిన పోలీసు.. సోషల్ మీడియాలో ఫొటో పెట్టి అధికారులకు ట్యాగ్.. ట్రాఫిక్ పోలీసుల రియాక్షన్ ఇదే

ఈ ఆర్డినెన్స్ కోర్టును ధిక్కరించడమే కాదు.. ఎన్నికలనూ ధిక్కరించడమే అవు తుందని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని, ఎన్నికైన ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించే అధికారాలను, మంత్రులకు సివిల్ సేవలు జవాబుదారీగా ఉండే నిబంధనలు అన్నింటినీ ఈ ఆర్డినెన్స్‌తో ధిక్కరించారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం