ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.
ఉత్తర ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ షూ తయారీ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని ఎంఎస్సీ మాల్కు సమీపంలో ఉన్న నరేలా ఇండస్ట్రియల్ ఏరియా సి 358లోని ఫ్యాక్టరీలో ఉదయం 8.37 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
కాలానికి అనుగుణంగా రెడ్ క్రాస్ సొసైటీ మారాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
ఆ తర్వాత వెంటనే ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని అన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా.. ప్రస్తుతం మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి.
Rainfall: ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వానలు.. మూతపడ్డ స్కూళ్లు, కార్యాలయాలు
కాగా. కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని నరేలాలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గ్రాన్యూల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో అగ్నిమాపక దళానికి చెందిన 27 వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. కానీ ఈ ప్రమాదం వల్ల ఆ ప్రాంతమంతా అలజడి, గందరగోళం నెలకొంది.
| After a fire call was received at 8:34am at a factory - C-358 Narela Industrial Area, near MSC Mall in , a total of 10 fire tenders were rushed to the site. Fire is now under control, so far no injuries reported: Delhi Fire Service | reported by ANI pic.twitter.com/sQNVds2rKk
— NDTV (@ndtv)పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలోని ఓ పెళ్లి పందాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఇటీవల కలకలం రేపింది. అనంతరం 23 ఫైరింజన్లను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఓ కారు కాలిపోయింది.