ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

By team teluguFirst Published Dec 16, 2022, 2:16 PM IST
Highlights

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో శుక్రవారం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. 

ఒడిశాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మయూర్‌భంజ్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని చెప్పారు.

అన్నను చంపి, శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు.. తండ్రి సాయంతో పారేసి.. చివరికి..

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు ప్రయాణికులను తీసుకొని ఖిచింగ్ నుండి బరిపాడకు నేషనల్ హైవే నెంబర్ 18పై వెళ్తోంది. ఈ క్రమంలో కులియానా చౌక్ సమీపంలోకి చేరుకునే సరికి బోల్తా పడింది. 

1 Dead, Over 40 Hurt As Passenger Bus Overturns In Odisha’s Mayurbhanj.

Baripada: At least one person died and over 40 others suffered injuries after a passenger bus overturned near Kuliana Chhak on NH-18 in Mayurbhanj district of Odisha here today. pic.twitter.com/9aekv4k3Ci

— Satish Kumar Dash🇮🇳 (@JournoSatish)

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులందరినీ స్థానికుల సహాయంతో బరిపాడలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించారు. 

click me!