మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. గాలివానలతో వేపచెట్టు కూలి రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు భక్తుల మృతి

Published : Apr 10, 2023, 05:47 AM IST
మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. గాలివానలతో వేపచెట్టు కూలి రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు భక్తుల మృతి

సారాంశం

మహారాష్ట్ర అకోలా జిల్లాలోని ఓ ఆలయం రేకుల షెడ్డుపై సమీపంలోనే ఉన్న వేప చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. సుమారు 35 మంది వరకు గాయపడ్డారు. అకోలాలో నిన్న వర్షాలు, గాలుళ్లు భీకరం అయ్యాయి.  

ముంబయి: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న కురిసిన భారీ వర్షం, భీకర గాలులతో ఆలయం పక్కనే ఉన్న పెద్ద వేప చెట్టు కూలిపోయి ఆలయ రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. మరో సుమారు 35 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం అకోలా జిల్లా బాలాపూర్ తహశీల్‌లోని పారాస్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి సుమారు 40 మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. అకోలా జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు భీకర గాలులూ వీచాయి. ఈ సమయంలో భక్తులు బాబూజీ మహారాజ్ మందిర్ సంస్థాన్‌లో గుమిగూడారు. ఈ గాలివాన కారణంగా ఆలయ సమీపంలోనే ఉన్న భారీ వేప వృక్షం కూలిపోయింది. ఆ వృక్షం ఆలయ రేకుల షెడ్డుపై పడింది.

సుమారు 40 మంది అక్కడ గుమిగూడారని అకోలా కలెక్టర్ నీమా అరోరా తెలిపారు. 36 మందిని సజీవంగా బయటకు తేగలిగామని, నలుగురు మరణించారని వివరించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని అన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు. 

Also Read: పదేళ్ల బాలికపై అత్యాచారం.. బ్లీడింగ్ కావడంతో ప్రైవేట్ పార్టులో మట్టి, ఇసుక పోసి..!

ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మృతుల సంతాపం ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీ స్పాట్‌కు చేరుకున్నారని, వారితో తాము టచ్‌లో ఉన్నామని వివరించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణయించినట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu