పంజాబ్‌ లూథియానాలో విషాదం: ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై తొమ్మిది మంది మృతి, 10 మందికి అస్వస్థత

Published : Apr 30, 2023, 10:22 AM ISTUpdated : Apr 30, 2023, 10:37 AM IST
పంజాబ్‌ లూథియానాలో విషాదం: ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై  తొమ్మిది మంది  మృతి, 10 మందికి అస్వస్థత

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని  లూథియానాలో  ఆదివారంనాడు  ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 


చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో  ఆదివారంనాడు  ఓ ఫ్యాక్టరీలో  గ్యాస్ లీకైన ఘటనలో  తొమ్మిది  మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. లూథియానాలోని  గియాస్‌పురా ప్రాంతంలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. గ్యాస్ లీకేజీ జరిగిన  ప్రాంతాన్ని  పోలీసులు  సీజ్  చేశారు.   అగ్నిమాపక అధికారులు  సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.  క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించారు  పోలీసులునేషనల్ డిజాస్టర్  రెస్పాన్స్  ఫోర్స్  బృందం  సంఘటన స్థలానికి  చేరుకుంది.  గ్యాస్ లీకేజీకి  సంబంధించిన కారణాలను  అధికారులు  అన్వేషిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?