తమిళనాడులో విషాదం: కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి, 15 మందికి గాయాలు

Published : May 13, 2021, 11:08 AM ISTUpdated : May 13, 2021, 11:18 AM IST
తమిళనాడులో విషాదం: కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి, 15 మందికి గాయాలు

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో గురువారం నాడు  ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో గురువారం నాడు  ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.గురువారం నాడు ఉదయం  కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం కార్మికులు  విధులకు హాజరైన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది.

 

బాయిలర్ పేలుడుతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి.  బాయిలర్ వద్ద పని చేసే ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీకి అనుమతి లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని ఎలా నిర్వహిస్తున్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.  మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబసభ్యులు  ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని తమ వారి కోసం ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?