తమిళనాడులో విషాదం: ప్రైవేట్ స్కూల్‌లో బాత్‌రూమ్ గోడకూలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

Published : Dec 17, 2021, 03:59 PM ISTUpdated : Dec 17, 2021, 04:01 PM IST
తమిళనాడులో విషాదం: ప్రైవేట్ స్కూల్‌లో బాత్‌రూమ్ గోడకూలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

సారాంశం

తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ లో బాత్ రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ  10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 3 లక్షలు  ఇచ్చింది.

చెన్నై: Tamilnadu లోని Thirunelveli జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు Schaffter Higher Secondary school లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే  రెస్క్యూ బృందం సంఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు చేపట్టారు.గోడ కూలిపోవడంతో 9వ తరగతి చదివే అన్భళగన్, ఎనిమిదవ తరగతి చదివే విశ్వరంజన్, ఆరో తరతతి చదివే సుతేష్ లు మరణించారు. సంజయ్(8వతరగతి), ప్రకాష్ (9వ తరగతి),. షేక్ అబూబకర్ కిదానీ( 12వ తరగతి) అబ్దుల్లా (7వ తరగతి) లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సానుఃభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సీఎం. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలను ప్రభుత్వం ప్రకటించింది.  ఈ ఘటనపై  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరమన్నారు. ఈ పాఠశాలను తక్షణమే తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వీటిని మరమ్మత్తులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం