జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం

By telugu news teamFirst Published Feb 19, 2020, 8:12 AM IST
Highlights

భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహించాయి. వీరి రాకను పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులతో తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.

జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందింది.

Also Read తండ్రికి ఫోన్ చేసి సంతోషంగా ఉన్నానంది.. అంతలోనే ..

దీంతో భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహించాయి. వీరి రాకను పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులతో తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు  కొనసాగుతున్నాయి. 

click me!