తమిళనాడులో జర్నలిస్టులపై కరోనా దెబ్బ: న్యూస్ ఛానల్‌‌లో పనిచేస్తున్న 27 మందికి కోవిడ్

Published : Apr 21, 2020, 04:06 PM ISTUpdated : Apr 21, 2020, 04:07 PM IST
తమిళనాడులో జర్నలిస్టులపై కరోనా దెబ్బ: న్యూస్ ఛానల్‌‌లో పనిచేస్తున్న 27 మందికి కోవిడ్

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లకు కూడ కరోనా సోకింది.

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లకు కూడ కరోనా సోకింది.

ఈ చానల్ లో పనిచేస్తున్న 24 ఏళ్ల జర్నలిస్టుకు కరోనా సోకింది. దీంతో ఈ చానల్ పనిచేస్తున్న 94 మంది పరీక్షలు నిర్వహించారు. వీరిలో 27 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఈ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు తండ్రి ఎస్ఐ.  

లాక్ డౌన్ విధుల్లో జర్నలిస్టులు, పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో తండ్రి సూచన మేరకు  ఎస్ఐ కుటుంబం పరీక్షలు చేయించుకొంది.దీంతో జర్నలిస్టుకు కరోనా సోకినట్టుగా తేలింది.  దీంతో ఎస్ఐ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు.

జర్నలిస్టుకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఈ ఛానల్ లో పనిచేస్తున్న 94 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ముంబైలో పనిచేస్తున్న 53 మంది జర్నలిస్టులకు కూడ కరోనా సోకింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:లాక్‌డౌన్: 21 రోజుల్లో 25 అడుగుల బావిని తవ్విన దంపతులు

ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడ తమకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి  లక్షణాలు లేకున్నా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకిందని బాధితులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay Takes Charge At CM: తొలి రోజే అధికారులని పరుగులు పెట్టించిన విజయ్ | Asianet Telugu
Vijay First Signatures: సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన సంతకాలు| Asianet News Telugu