నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరి మృతి

By ramya NFirst Published Apr 5, 2019, 10:10 AM IST
Highlights

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. 

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. యశ్వంత్ పూర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగుగంటలకు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. శిథిలాల కింద కొందరు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!