రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

Published : Nov 14, 2018, 10:18 AM IST
రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించి.. ఇద్దరు ఆ అగ్నికి ఆహుతైన సంఘటన ముంబయి నగరంలోని అంథేరీలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

అది 21 అంతస్థుల బిల్డింగ్ కాగా.. అకస్మాత్తుగా 5, 6వ అంతస్థుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే