రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

Published : Nov 14, 2018, 10:18 AM IST
రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించి.. ఇద్దరు ఆ అగ్నికి ఆహుతైన సంఘటన ముంబయి నగరంలోని అంథేరీలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

అది 21 అంతస్థుల బిల్డింగ్ కాగా.. అకస్మాత్తుగా 5, 6వ అంతస్థుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌