రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

Published : Nov 14, 2018, 10:18 AM IST
రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించి.. ఇద్దరు ఆ అగ్నికి ఆహుతైన సంఘటన ముంబయి నగరంలోని అంథేరీలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

అది 21 అంతస్థుల బిల్డింగ్ కాగా.. అకస్మాత్తుగా 5, 6వ అంతస్థుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?