1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యూసుఫ్ మెమెన్ మృతి

Siva Kodati |  
Published : Jun 26, 2020, 05:34 PM IST
1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యూసుఫ్ మెమెన్ మృతి

సారాంశం

1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు. 

1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు.

ఉదయం పది గంటల సమయంలో జైల్లో బ్రష్ చేసుకుంటూ యూసుఫ్ స్పృహ తప్పి పడిపోవడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమెన్‌కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో అతను దోషిగా తేలడంతో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018 జూలై 26 నుంచి యూసుఫ్ జైలులో ఉండగా.. టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !