17యేళ్ల బాలికను లైంగికంగ వేధించి.. రెండంతస్తుల భవనం మీదినుంచి కిందికి తోసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో బాధితురాలి వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు.
17యేళ్ల బాలికను లైంగికంగ వేధించి.. రెండంతస్తుల భవనం మీదినుంచి కిందికి తోసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో బాధితురాలి వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు.
సోమవారం రాత్రి చాతా ప్రాంతంలో సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాలికను రోడ్డు మీదికి తోసి, నిందితులు పారిపోతున్న దృశ్యాలు వాటిలో రికార్డయ్యాయి.
ఆ వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా ఈ ఘటనలో ఆమె వెన్నెముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. దీని మీద ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంట్లో ముగ్గురు నిందితుల పేర్లు వెల్లడించారు. వారు గత కొద్ది నెలలుగా బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి సోమవారం రాత్రి నాకు ఫోన్ చేశాడు. నా కుమార్తెతో మాట్లాడించాలని బెదిరించాడు. కుదరదని చెప్పడంతో.. చాలా అసభ్యంగా నిందించాడు. ఆ వెంటనే ఆ ముగ్గురు మా ఇంట్లోకి దూసుకొచ్చారు. నా కుమార్తెను లైంగికంగా వేధించి, తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మేమంతా గట్టిగా అరిచి, అడ్డుకోవడంతో తనను రెండో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. అంటూ బాలిక తండ్రి వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.