డబ్బుల కోసం ఏర్పడిన వివాదంలో 16యేళ్ల బాలుడు తన తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో చోటు చేసుకుంది.
రాయ్పూర్ : రాయ్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదే పదే డబ్బులు అడుగుతున్నాడని, ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నాడని తన తమ్ముడిని చంపేశాడో ఓ 16యేళ్ల బాలుడు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్యరాత్రి చోటు చేసుకుంది. డబ్బుకు సంబంధించిన వివాదంలో 16 ఏళ్ల బాలుడు తన తమ్ముడిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
నిమోరా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
చనిపోయిన వ్యక్తి డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటాడని, ఎక్కువ ఖర్చు చేస్తాడని.. తన సోదరుడిని డబ్బు కోసం తరచూ అడిగేవాడని ప్రాథమిక విచారణలో నిందితుడు ఆరోపించాడు. ఈ విషయమై మంగళవారం అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన బాలుడు రాత్రిపూట తన తమ్ముడు నిద్రిస్తుండగా పికాక్స్తో కొట్టాడని దీంతో ఆ బాలుడు చనిపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.