మహారాష్ట్రలోని బరామతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై ఏడాదికిపైగా అత్యాచారం జరిగింది. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎదో ఒక చోట లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహిళలు కనిపిస్తే చాలా మగాళ్లలో ఉన్న మృగాలు బయటకు వస్తున్నాయి. వావి వరసలు మరిచి కామంతో కాటేస్తున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళ శారీరక, మానసిక పరిస్థితి కూడా ఆలోచించడం లేదు. వికలాంగులపై కూడా లైంగికదాడులకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది.
నోయిడాలో నాలుగేళ్ల బాలికపై స్కూల్ వాష్రూమ్లో డిజిటల్ రేప్
ఓ మానసిక వికలాంగ మైనర్ బాలికపై ఏడాదికి పైగా అత్యాచారం జరపడంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటు చేసుకుంది. పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా వాల్చంద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు. 6వ తరగతి చదువుతున్న బాధితురాలిపై నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు అనేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. .హైదరాబాద్ కు అమిత్ షా
బాధితురాలు గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ తో పాటు మరో ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుభాంగి అమోల్ కుచేకర్ అనే నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఓ నిందితుడు ఆమెను బైక్పై ఎక్కించుకొని సమీపంలో ఉన్న చెరుకు తోట వద్దకు తీసుకెళ్లేవాడు అక్కడ అనిల్ నలవాడే అనే మరో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఏడాది కాలానికి పైగా బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బారామతి డీవైఎస్పీ గణేష్ ఇంగ్లే వెంటనే రంగంలోకి దిగారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.